🛒 కావలసిన పదార్థాలు:
- రొయ్యలు (శుభ్రం చేసినవి) – 250 గ్రాములు
- ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి – 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- కారం – 1 టీ స్పూన్
- పసుపు – ¼ టీ స్పూన్
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- గరం మసాలా – ½ టీ స్పూన్
- కరివేపాకు – కొద్దిగా
- కొత్తిమీర – కొద్దిగా
- నిమ్మరసం – 1 టీ స్పూన్ (ఆప్షనల్)
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – తగినంత
👩🍳 తయారు చేసే విధానం:
🔹 స్టెప్ 1: రొయ్యలు మెరినేట్ చేయడం
శుభ్రం చేసిన రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి 10–15 నిమిషాలు మారినేట్ చేయండి.
🔹 స్టెప్ 2: ఫ్రై చేయడం
పాన్లో నూనె వేసి వేడి అయిన తరువాత మారినేట్ చేసిన రొయ్యల వేయించుకోవాలి. వేగినతరువాత తీసి పక్కన పెట్టాలి.
🔹 స్టెప్ 3: మసాలా తయారీ
2 టేబుల్ స్పూన్ల నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
🔹 స్టెప్ 4: రొయ్యలు కలపడం
ఇప్పుడు వేయించిన రొయ్యలు వేసి మీడియం మంటపై 5–7 నిమిషాలు ఉడికించాలి. రొయ్యలలోని నీరు పోయి డ్రై అయ్యే వరకు వేయించండి.
🔹 స్టెప్ 5: ఫైనల్ టచ్
చివరిగా గరం మసాలా, నిమ్మరసం(ఆప్షనల్) వేసి కలిపి కొత్తిమీరతో అలంకరించండి.
😋 సర్వింగ్ సూచనలు:
- వేడి వేడి అన్నం + నెయ్యి తో అద్భుతంగా ఉంటుంది
- రోటీ, చపాతీకి కూడా బాగా సరిపోతుంది
🔥 ప్రత్యేక చిట్కాలు:
- రొయ్యలు ఎక్కువగా కుక్ చేస్తే గట్టిగా అవుతాయి, కాబట్టి 5–7 నిమిషాలే సరిపోతుంది
- కొంచెం పెప్పర్ పౌడర్ వేసితే స్పైసీ టేస్ట్ పెరుగుతుంది
- కొబ్బరి తురుము చివర్లో వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది
