
ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
ఈరోజు తెలుగువారందరు ఎంతో ఉత్సాహంతో సంతోషంగా జరుపుకుంటారు.ఈ పండగ ప్రత్యేక వంటకం భక్ష్యాలు /బొబ్బట్లు.వేరు వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ,రకరకాలుగా చేస్తారు. కొంతమంది వేరుశెనగ పప్పు,బెల్లంతో ,కొంత మంది శెనగపప్పు,నువ్వులు చాలా రకాలుగా చేస్తారు. మా ఇంట్లో శెనగపప్పుతో చేస్తారు. మా అమ్మ ఉగాది రోజున మాత్రమే భక్ష్యాలను తయారుచేసేది. ఎందుకంటే ఇది విస్తృతమైన ప్రక్రియ మరియు ఆమె మా పొరుగువారికి మరియు స్నేహితుల కోసం తయారుచేసేది. ఈ స్వీట్ తయారీలో నేను సహాయం చేసేదాన్ని. నేను వీటిని ఎంతగానో ఇష్టపడతాను. మరియు తెలుగువారికి ప్రత్యేకమైనది ఈ భారతీయ వంటకం.సులభమైన పద్దతిలో మీకోసం.
కావలసిన పదార్థాలు:-
- మైదా : కప్పున్నర
- శెనగపప్పు :ఒక కప్పు
- బెల్లం : ఒక కప్పు
- ఉప్పు : చిటికెడు
- నూనె : 2టేబుల్ స్పూన్లు
- నెయ్యి : 2టేబుల్ స్పూన్లు
- సోంపు పొడి : అర టీ స్పూన్
- నీళ్లు : తగినంత
తయారుచేయు విధానం:-
1
2
3
4
5
చేతికి నూనె రాసుకుని,ఈ ఉండలని ప్లాస్టిక్ పేపర్ మీద శెనగపప్పు మిశ్రమం బయటికి రాకుండా గుండ్రంగా ఒత్తాలి.