చోళే బతుర| నోరూరించే పంజాబీ వంటకం.మసాలా శనగల కర్రీ మరియు ఫ్రైడ్ ఫ్లాట్బ్రెడ్స్’ కలయికను ‘చోళే బతుర’ అంటారు.ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకంను ఉత్తరభారతదేశంలో ఎక్కువగా అల్పాహారం/చిరుతిండిగా తీసుకుంటారు.దీనిని అల్పాహారంతో పాటు భోజనం లేదా విందుగా కూడా అందించవచ్చు.
కావలసిన పదార్థాలు:-
- సెనగలు : ఒకటిన్నర కప్పు
- తరిగిన ఉల్లిపాయ : కప్పు
- తరిగిన టమోటా : 2 కప్పులు
- కారం : 1 స్పూన్
- గరంమసాలా : అర టీ స్పూన్
- ధనియాల పొడి : టీ స్పూన్
- జీలకర్రపొడి : టీ స్పూన్
- చోళే మసాలా : రెండు టీ స్పూన్లు
- నూనె : మూడు టేబుల్ స్పూన్లు
- టొమాటో కెచెప్ : రెండు టీ స్పూన్లు
- మైదా : ఒకటిన్నర కప్పు
- బొంబాయి రవ్వ / సుజి : అరకప్పు
- బేకింగ్ పౌడర్ : ఒకటిన్నర స్పూన్
- చక్కెర : రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు : తగినంత
- నూనె : మూడు టేబుల్ స్పూన్లు
- పెరుగు : కప్పు
- గోరువెచ్చని నీరు : తగినంత
- నూనె : వేయించడానికి
సూచనలు :-
సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఈ వంటకాన్ని చేసుకోవాలి.
బతుర కోసం పిండిని కనీసం రెండుగంటల ముందు కలిపి పెట్టుకోవాలి.
తయారుచేయు విధానం:-
1
సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.నానబెట్టిన సెనగలను కుక్కర్ లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
2
ఉల్లిపాయలు ,టొమాటోలు విడి విడిగా మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
3
ఇపుడు కడాయిలో నూనెపోసి వేడి అయిన తరువాత ఉల్లిపేస్ట్ ని వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తరువాత టొమాటో ప్యూరిని,అల్లంవెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి మూడు నిముషాలు వేయించాలి. తరువాత మిగిలిన మసాలా పొడులన్ని వేసి మరో మూడు నిముషాల పాటు ఉడికించాలి.
4
చివరగా ఉడికించిన సెనగలు వేసి తగినన్ని సెనగలు ఉడికించిన నీటిని,ఉప్పు వేసి బాగా కలిపిన తరువాత టమాటో కెచప్ వేసి కలిపి మూత పెట్టి ఓ ఐదు నిముషాలు ఉడికించి దించాలి.
5
ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి తీసుకుని,అందులో ఉప్పు,చక్కెర,రవ్వ,బేకింగ్ సోడా,పెరుగు,నూనె వేసి బాగా కలిపి,గోరువెచ్చని నీరు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని,దానిపైన కొంచెం నూనె వేసి కలిపి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
6
తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని కొంచెం మందమైనపూరీలుగా చేసుకుని,నూనెలో రెండువైపులా వేయించుకుని, వేడి వేడి చోళే మసాలాతో వడ్డించుకోవాలి.