కావలసిన పదార్థాలు:-
- మైదా – ఒక కప్పు
- పెరుగు – అర కప్పు
- పంచదార – 1 కప్పు
- వంట సోడా : చిటికెడు
- కేసరి/ఎల్లో ఫుడ్ కలర్ : చిటికెడు
- యాలకులపొడి : చిటికెడు
- నీరు – తగినంత
- నూనె-వేయించడానికిసరిపడా.
తయారుచేయు విధానం:-
1
ఒక పాత్రలో పంచదార, నీరు, కలిపి స్టవ్ పై పెట్టి, మరిగించి, తీగపాకం వచ్చాక,పక్కన పెట్టుకోవాలి.
2
: తరువాత ఇంకొక పాత్రలో మైదా, వంటసోడా, పెరుగు, ఫుడ్ కలర్, వేసి కలిపి,తగినంత నీరు పోసి జారుగా కలుపుకోవాలి.
3
కడాయిలో నూనె పోసి వేడైన తరువాత,కలుపుకున్న పిండిని సాస్ బాటిల్లో కానీ పాలిథిన్ కవర్ తో చేసిన కోన్ లో కానీ వేసి, వేడి నూనెలో జీలేబిల్లా వేసుకుని, వేయించి తీసి, చక్కెర పాకంలో వేయాలి.
4
పదినిముషాల తరువాత ప్లేట్ లోకి తీసుకుని,కాసేపటికి వడ్డించుకుంటే చక్కరపాకం జీలేబీలకు పట్టి మరింత తియ్యదనాన్ని,రుచిని ఇస్తాయి. జీలేబీలు వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి
చిట్కాలు :-
చక్కరపాకం గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోవాలి.చల్లారిన పాకంలో వేసినప్పుడు జీలేబీలు ఎక్కువగా పాకాన్ని పట్టుకోలేవు.
జీలేబీలు వేయాడానికి సాస్ బాటిల్ కానీ, మందమైన క్లాత్ కి చిన్న రంద్రం చేసి జీలేబీలు వేసుకోవచ్చు. లేదా పాలిథిన్ కవర్ / పాలపాకెట్ ని కోన్ లా చేసి అందులో పిండి వేసి జీలేబీలు వేసుకోవచ్చు.