మినుప వడలు ప్రసిద్ధ దక్షిణ భారత సాంప్రదాయ అల్పాహార వంటకం.మినపవడలను చిరుతిండిగా కూడా తింటారు.ఈ తేలికపాటి చిరుతిండిని సులభంగా తయారు చేసుకోవచ్చు.రుచికరంగా ఉండే ఈ వడలను అందరు ఇష్టపడతారు.
కావలసిన పదార్థాలు:-
- మినప్పప్పు : రెండు కప్పులు
- తరిగిన ఉల్లిపాయలు :ఒక కప్పు
- తరిగిన అల్లం : రెండు స్పూన్లు
- పచ్చిమిర్చి : ఐదు
- తరిగిన కరివేపాకు : పావు కప్పు
- తరిగిన కొత్తిమీర : పావు కప్పు
- నూనె : తగినంత
- ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం:-
1
మినప్పప్పుని ఆరు గంటలు నానబెట్టాలి.
2
తరువాత నీరు వంచేసి మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు నీరు పొయకుండా గ్రైండ్ చేయాలి.
మరీ కుదరకపొతె కొంచెం నీరు కలిపి మెత్తగా పిండి పట్టండి. నీరు పోస్తే వడనూనె ఎక్కువగా పీల్చుకుంటుంది.
3
పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు,సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.
4
నూనె వేడయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం నూనె రాసి,చెయ్యి తడిచేసుకుని పిండి కొంచెం కొంచెం తీసుకుని కవర్ మీద గుండ్రంగా చేత్తో వొత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చెయ్యాలి.
5
వడని మెల్లగా చేతిలోకి తీసుకుని నూనెలో నిదానంగా వేసి,రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. ఇలా అన్ని వడలు చేసుకుని వేయించుకోవాలి.
అల్లంపచ్చడి తో కాని కొబ్బరిపచ్చడితో కాని వడ్డించండి.