ఇన్స్టంట్ పల్లి చట్నీ
కానీ అది రోజు అంటే ఇబ్బందే ఒక రకంగా, అందులోనూ జాబ్ చేసే ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో అయితే చాలా ఇబ్బందికారంగా ఉంటుంది. ఇటు టిఫిన్లు చేయడం, అటు లంచ్ బాక్స్ కోసం వంటలు, ఈ క్రమంలో ఇంట్లో అల్పాహారం చేయడం అనేది తగ్గుతూ వస్తుంది.
కొంతమందికి టిఫిన్, చట్నీ రెండు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అదే అప్పటికప్పుడు (ఇన్స్టంట్ )తేలికగా, గ్రైండ్ చేయాల్సిన పనిలేకుండా చట్నీ అయితే ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. ఆ ఆలోచనతో వచ్చిందే ఇన్స్టంట్ పల్లి చట్నీ పొడి. ఒక్కసారి చేసిపెట్టుకుంటే, నెలరోజులవరకు ఉంటుంది.
అందులోనూ మామూలుగా చేసే చట్నీ రుచితో మరియు తాజాగా చేసిన అనుభూతిని ఇస్తుంది. మరి ఎందుకింకా ఆలస్యం మీరు ప్రయత్నించండి..
కావలసిన పదార్థాలు:-
- పల్లీలు : ఒక కప్పు
- పుట్నాలు: అరకప్పు
- ఎండుమిర్చి : 6-8
- జీలకర్ర : అర టీస్పూన్
- ఆవాలు : అర టీస్పూన్
- వెల్లుల్లి : 10 పాయలు
- కరివేపాకు : 2 రెమ్మలు
- ఉప్పు : తగినంత
- తాలింపుకు కావలసినవి :-
- ఎండుమిర్చి : 3
- జీలకర్ర : పావు టీస్పూన్
- ఆవాలు : పావు టీస్పూన్
- కరివేపాకు : 1 రెమ్మ
- పసుపు : చిటికెడు
- నూనె : 2 టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:-
1
కడాయి లేదా నాన్ స్టిక్ పాన్ స్టవ్ పై పెట్టి వేడైన తరువాత పల్లీలు వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి.
2
పల్లీలు దోరగా అయిన తరువాత పుట్నాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు,జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేసి కలుపుతూ కరివేపాకు పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి.
3
చేతితో ఒత్తినపుడు పొడి పొడిగా అయినప్పుడు, స్టవ్ ఆపేసి చల్లపరచుకోవాలి.పల్లిల మిశ్రమం చల్లబడిన తరువాత మిక్సీలో వేసి, పొడిగా చేసుకోవాలి.
4
తాలింపు కోసం ఒక పెనంలో నూనె పోసి వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు బాగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి.
5
స్టవ్ ఆపేసి, ఈ పోపును గ్రైండ్ చేసుకున్న చట్నీ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పువేసి బాగా కలుపుకుని, గాలి చొరబడని డబ్బాలో పోసి నిలువ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
6
మనకు అవసరమైనపుడు, బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు, ఒక గిన్నెలో 4 లేదా 5 స్పూన్ల పొడి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ బాగా కలుపుకుంటే చాలా రుచికరమైన ఇన్స్టంట్ చట్నీ రెడీ.