పోంగనాలు
| పొంగనాలను కొన్ని ప్రాంతాల్లో పనియారం అని గుంతపొంగనాలు అని పిలుస్తారు.ఇది చాలా తేలికైన వంటకం.వీటిని ఇడ్లీ లేదా దోసెపిండితో కూడా వేసుకోవచ్చు.వేరు వేరు పద్దతులతో చేస్తారు.అల్పాహారంగాను,స్నాక్స్ గాను తింటారు.
కావలసిన పదార్థాలు:-
ఇడ్లీ రవ్వ : అరకప్పు
మినప్పప్పు: పావు కప్పు
తరిగిన ఉల్లిపాయలు : పావు కప్పు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెబ్బ
ఉప్పు: తగినంత
తయారుచేయు విధానం:-
1
మినప్పప్పు కడిగి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి.
2
తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో ఇడ్లి రవ్వ కలపిన ఈ పిండిని ఎనిమిది గంటలపాటు పులియనివ్వాలి.
3
తరవాత సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులను , పిండిలో కలపాలి. తగినంత ఉప్పుని కలుపుకోవాలి
4
పొంగనాల పెనాన్ని స్టవ్మీద పెట్టి ఒక్కో గుంతలో రెండుమూడు చుక్కల నూనె వేసి, పిండి మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఓరెండు నిముషాల పాటు చిన్న మంటపై ఉడకనివ్వాలి.
5
తరవాత స్పూనుతో పొంగనాలను నెమ్మదిగా రెండో వైపునకు తిప్పాలి. ఇలా రెండు వైపులా చిన్న మంట మీద ఉడికించి దించితే పొంగనాలు రెడీ.